English | Telugu

రామ్ చరణ్ రచ్చలో కలర్స్ స్వాతి

రామ్ చరణ్ "రచ్చ" లో కలర్స్ స్వాతి నటిస్తూందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యువహీరో రామ్ చరణ్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా,"ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమా జూన్ రెండవ వారంలో ప్రారంభం కానుంది. ఈ రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో కలర్స్ స్వాతి ఒక ముఖ్య పాత్రలో నటించనుందట. అలాగే రామ్ చరణ్ "రచ్చ" దర్శకుడు సంపత్ నంది అభ్యర్థన మేరకు స్వాతి ఈ చిత్రంలో ఒక పాటను కూడా పాడనుందని తెలిసింది.

స్వాతి గతంలో "అష్టచమ్మ, కలవరమాయె మదిలో, గోల్కొండ హైస్కూల్" వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో "100%లవ్" సినిమాలో "ఏ స్క్వేర్ బి స్క్వేర్" అనే హిట్ సాంగ్ ని కూడా పాడి గాయకురాలిగా కూడా మారింది. రామ్ చరణ్ "రచ్చ" సినిమాకి మణిశర్మ సంగీత దర్శకుడు. రామ్ చరణ్ "రచ్చ" సినిమాలో కొంత భాగం శ్రీలంకలో షూటింగ్ జరుపుకోనుందట. ఈ సినిమా కోసం హీరో రామ్ చరణ్ శారీరకంగా విదేశంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.