English | Telugu

సునీల్ హీరోగా చిత్రాలు

సునీల్ హీరోగా చిత్రాలు బాగానే రానున్నాయి. వివరాల్లోకి వెళితే హిందీలో సూపర్ హిట్టయిన "తను వెడ్స్ మను" చిత్రాన్ని తెలుగులో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సునీల్ హీరోగా, దేవీ ప్రసాద్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. దీని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లో, సునీల్ హీరోగా "సంబరాల రాంబాబు" అనే పేరుతో ఒక చిత్రం రూపుదిద్దుకోనుంది.

తమిళ చిత్రం "వేట్టై" తెలుగు రీమేక్ లో నాగచైతన్యతో పాటు సునీల్ కూడా హీరోగా నటిస్తున్నాడు. అలాగే "నెపోలియన్" అనే చిత్రంలోనూ, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్న "బంతి" అనే చిత్రంలోనూ సిక్స్ ప్యాక్ రాయల్ హీరో సునీల్ నటించటానికి అంగీకరించాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.