English | Telugu

రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త"

రేపటి నుండి రామ్ "ఒంగోలు గిత్త" షూటింగ్ గుంటూరులో ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే చురుకైన యువ హీరో రామ్ హీరోగా, ఒక కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తూ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మిస్తున్న నూతన చిత్రం "ఒంగోలు గిత్త". ఈ రామ్ "ఒంగోలు గిత్త" చిత్రం మొన్న మార్చ్ 9 వ తేదీన హైదరాబాద్ లోని నిర్మాత కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది.

రెగ్యులర్ షూటింగ్ మాత్రం రేపటి నుండి అంటే మే 27 వ తేదీ నుండి గుంటూరులో ప్రారంభం కానుంది. ఈ కథ రామ్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయేలా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించాడని సమాచారం. రామ్ "ఒంగోలు గిత్త" చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్నందిస్తున్నారు. రామ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, కరుణాకరున్ దర్శకత్వంలో, స్రవంతి రవికిశోర్ నిర్మించిన "ఎందుకంటే ప్రేమంట" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.