English | Telugu

ఘనంగా ప్రారంభమైన ఆది "సుకుమారుడు"

లవ్లీ స్టార్ ఆది హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా, "పిల్ల జమీందార్" ఫేం అశోక్ దర్శకత్వంలో, శ్రీ సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై, కె.వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం "సుకుమారుడు". "మే" 24 వ తేదీన ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో, కె.యస్.రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, శ్రీను వైట్ల క్లాప్ కొట్టగా, ముహూర్తం షాట్ కు బి.జయ గౌరవ దర్శకత్వం వహించగా, బెల్లంకొండ సురేష్ స్క్రిప్ట్ అందించగా ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో ఆది ప్రసంగిస్తూ తనను హీరో చేసిన ఆర్ ఆర్ మూవీ మేకర్స్ అధినేత వెంకట్ గారికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని కూడా ఆయన అన్నారు. దర్శకుడు అశోక్ ప్రసంగిస్తూ "ఈ చిత్రంలో ఆది పాత్ర సుకుమారుడు కానీ ఈ పాత్రలో రఫ్ గా ఉండే మరో కోణం కూడా ఉంటుంది" అన్నారు.ఈ చిత్రాన్ని కె.వి.వి.సత్యన్నారాయణ సమర్పిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.