English | Telugu

ssmb 29 నుంచి మకుట ని తప్పించారా? వైరల్ అవుతున్న న్యూస్

'ssmb 29 'ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. ఈ మేరకు 'రామోజీ ఫిలిం సిటీ'(RfC)లో వేసిన భారీ సెట్టింగ్స్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ వరకు జరిగే ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు తో పాటు, చిత్ర ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రియాంకచోప్రాతో మరికొంత మంది ప్రపంచ నటులు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో 'ssmb 29 'పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ మూవీగా ముస్తాబవుతుంది.

ssmb 29 యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'విజువల్ ఎఫెక్ట్స్'(VFX)కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా ఈ చిత్రానికి 'విఎఫ్ఎక్స్' బాథ్యతలని నిర్వహిస్తున్న 'మకుట'(Makuta)ని తప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర, ఈగ, బాహుబలి పార్ట్ 1 , పార్ట్ 2 , ఆర్ ఆర్ ఆర్, వంటి ప్రతిష్ఠాత్మక చిత్రాలకి సంబంధించిన విఎఫ్ఎక్స్ ని 'మకుట' నే అందించింది. రాజమౌళి దర్శక మేధస్సు నుంచి వచ్చిన ఆయా చిత్రాలకి 'విఎఫ్ఎక్స్ 'ఎంతో ముఖ్యం. పైగా ఆయా చిత్రాల 'విఎఫ్ఎక్స్' వర్క్స్ కథలో మిళితమైనవి. దీంతో 'విఎఫ్ఎక్స్' బాగుంటేనే సినిమా విజయవంతమవుతుంది. ఈ విషయం ఆయా చిత్రాలు చూసిన ప్రతి ప్రేక్షకుడికి తెలుసు. ఆయా చిత్రాల విజయం తాలూకు పెరగడంలో కూడా 'మకుటా' ప్రధాన పాత్ర పోషించింది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 'మకుట' కి భారతదేశంలోనే అగ్ర నిర్మాణ సంస్థ.

2008 లో అమీర్ ఖాన్,అల్లు అరవింద్ ల 'గజనీ' తో విఎఫ్ఎక్స్ రంగంలోకి అడుగుపెట్టిన 'మకుట' కి హైదరాబాద్ తో పాటు, వరల్డ్ వైడ్ గా ఎన్నో బ్రాంచ్ లు ఉన్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ గెలుచుకోవడంతో పాటు, ఈగ, మగధీర సినిమాకి 'ఇండియన్ గవర్నమెంట్' చేత నేషనల్ అవార్డు ని సైతం అందుకుంది. అలాంటిది ssmb 29 టీం 'మకుట' ని తప్పించడం ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. కమలా కన్నన్(kamala Kannan)మకుట సంస్థ అధినేత.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.