English | Telugu

శ్రియ రిస్క్ వ‌ర్క‌వుట‌వుద్దా?

ఫిట్‌నెస్ కి ప‌ర్యాయ‌ప‌దంలా నిలిచే అందం ఢిల్లీ డాళ్ శ్రియ సొంతం. ఈ జ‌న‌రేష‌న్ హీరోయిన్ల‌లో లాంగ్ ర‌న్ మెయిన్‌టెయిన్ చేసిన వారిలో ఈ సొగ‌సిరిదే ప్ర‌థ‌మ స్థానం. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, ఇంగ్లీష్‌.. ఇలా లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా మ‌ల్టీలాంగ్వేజెస్‌లో త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది ఈ నాజూకూ సుంద‌రి. అయితే.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విజయాల‌ను సొంతం చేసుకున్న ఈ 30 ప్ల‌స్ సొగ‌సు బాలీవుడ్‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు హిట్ కొట్ట‌లేక‌పోయింది. షుక్రియా, తుఝే మేరీ క‌స‌మ్‌, తోడా తుమ్ బ‌ద‌లే తోడా హ‌మ్‌, ఏక్‌, ఆవారాప‌న్‌.. ఇలా చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో సినిమాలు చేసినా శ్రియ‌కి నిరాశే ఎదురైంది. వీటిలో ఆవారాప‌న్ మ్యూజిక‌ల్‌గా సెన్సేష‌న్ అయినా.. హిట్ లిస్ట్‌లోకి చేర‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో శ్రియ రిస్క్ తీసుకుని ఓ టీనేజ్ గ‌ర్ల్‌కి అమ్మ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది త‌న తాజా హిందీ సినిమాలో. ఆ సినిమానే దృశ్యం. మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, తెలుగు భాష‌ల్లో రూపొంది హిట్ అయిన ఈ సినిమా హిందీలోనూ హిట్ కావ‌డం ఖాయం అని.. త‌న‌ను ఇన్నాళ్లుగా ఊరిస్తున్న విజ‌యం దృశ్యం రీమేక్‌తో ల‌భిస్తుంద‌ని శ్రియ చెప్పుకొస్తోంది. అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టించిన ఈ సినిమా జులై 31న రిలీజ్ కానుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.