English | Telugu

'శ్రీ‌మంతుడు' బజ్ అదిరింది..మరి సినిమా!!

సూపర్ స్టార్ శ్రీమంతుడు సినిమా రిలీజ్ ఇంకా ఇరవై నాలుగు గంటలే వుంది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం పాజిటివ్ బజ్ నడుస్తుండడం విశేషం. బాహుబలి లాంటి సినిమాకి కూడా రిలీజ్ ముందు నెగిటివ్ టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. సాధారణంగా టాలీవుడ్ లో సినిమాలపై ఒకరు హిట్ అంటే మరొకరు ఫ్లాప్ అనడం ఎక్కువగా చూస్తుంటాం.కానీ శ్రీమంతుడు విషయంలో అంతటా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది.

సెన్సార్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్ రప్పించుకున్న శ్రీమంతుడు..రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు అభిమానులను అలరించబోతున్నాడట. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్,హైప్, ఇతరత్రా వ్యవహారాలను దృష్టిలో వుంచుకుని, 80 కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా హక్కులు ఈరోస్ సంస్థ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందంతా శ్రీ‌మంతుడి బిజినెస్ మ్యాజిక్‌. ఈ బజ్ ఏ మేరకు వాస్తవమో కొద్ది గంటల్లో జనాలే చెబుతారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.