English | Telugu

శ్రీమంతుడు ఆడియో: దేవిశ్రీ అదరగొట్టాడు

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు ఆడియో అభిమానుల మధ్య గ్రాండ్ గా రిలిజైంది. ఆడియో ఫంక్షన్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. దేవి శ్రీ, మహేష్ కాంబినేషన్లో ఇది వరకే వచ్చిన నేనొక్కడినే సినిమా ఆడియో సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమా మ్యూజిక్ పై అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీమంతుడు పాటలు అభిమానులు ఆకట్టుకుంటాయనే చెప్పాలి. ముఖ్యంగా రెండో పాట 'జత కలిసె' విన్న వెంటనే నచ్చే విధంగా వుoదని చెప్పాలి. పాటలో థీమ్ చాలా క్లాసిక్ టచ్తో ఉంది. అలాగే విజువల్గానూ ఈ పాట చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా సింపుల్ కాన్సెప్టుని హృదయాలకు హత్తుకునే లా తెరకెక్కించారు. తొలి పాట రామ రామ కూడా వెరీ స్పెషల్. సూరజ్ సంతోష్ రాణి నా రెడ్డి ఈ పాటని ఆలపించారు.గాయనీగాయకులు పాడిన శైలి మహేష్ స్టెప్పులు ఎంతో ఎనర్జిటిక్గా ఉన్నాయి. దేవీ మార్క్ ఎనర్జీ బాణీలో పెద్ద అస్సెట్ అయ్యింది. సీనియర్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మరోసారి పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. శ్రీమంతుడు ఆల్బమ్ లో ఇదో ఎనర్జిటిక్ సాంగ్. అలాగే విజువల్ గా ఈ పాట చాలా రిచ్ గా ఉంది. ఓ ఇంటి మండువాలో రంగు రంగుల కాంతుల మధ్య కలరింగు మధ్య ధేధీప్యమానంగా చిత్రీకరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.