English | Telugu

వాస్తవంలోకి రావమ్మా శ్రీదేవి!

ఐదుపదులు దాటినా ఇంకా హీరోయిన్ లానే కనిపించాలంటే కుదురుతుందా? కానీ శ్రీదేవికి ఆ పాకులాట ఏమాత్రం తగ్గలేదు. ముసలైపోయినా ఇంకా తాపత్రయం పోలేదు. దట్టంగా మేకప్, కైపెక్కించే డ్రస్సులు వేసుకుని తెగ రెచ్చిపోతోంది. రీఎంట్రీలో ఆఫర్ రావడమే ఎక్కువనుకుంటే..శ్రీదేవికి ఉండే ఫాలోయింగ్ రీత్యా అదేమంత పెద్ద కష్టం కాదనుకున్నారు. కానీ వచ్చిన ఛాన్సులను కూడా వదులుకుని తప్పుచేస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

విడుదలకు సిద్ధంగా ఉన్న బాహుబలిలో శివగామి పాత్రకోసం ముందుగా అమ్మడినే సంప్రదించారు. కానీ కాసులుకోసం కాస్త అతిగా కక్కుర్తిపడిన శ్రీదేవి ఆ ఛాన్స్ వదులుకుంది. ఎంచక్కా రమ్యకృష్ణ ఆ పాత్రలో నటవిశ్వరూపం ప్రదర్శించిందని చెబుతున్నారు. అటు కోలీవుడ్ పులిమూవీలో మాత్రం మహారాణి పాత్రకోసం సై అంది.

ఆ లుక్ చూస్తుంటే శ్రీదేవి అసహ్యంగా కనిపిస్తోంది. పైగా జనాలంతా ముసలి సుందరిని పట్టుకుని అతిలోకసుందరి అని తెగ ఊదరగొడుతున్నారు. ఏదేమైనా కాస్త బలుపుతగ్గించుకుని హుందాగా ప్రవర్తిస్తే...రీఎంట్రీలో శ్రీదేవికి ధీటుగా ఎవ్వరూ నిలబడలేరన్నది వాస్తవం. మరి ఈ విషయం ఆమె ఎప్పుడు గ్రహిస్తుందో ఏమో?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.