English | Telugu

స్పిరిట్ ఓటిటి డీల్ పై ఆసక్తికర వార్త.. నిజమేనంటారా!

షూటింగ్ ప్రారంభం కాకముందే ఏంటి ఇదంతా
అసలు ఆ న్యూస్ నిజమేనా!
ప్రభాస్, సందీప్ రెడ్డి క్రేజ్ స్థాయి ఇదేనా!


కొన్ని కాంబినేషన్స్ పై అంచనాలు ఏర్పడటం సహజం. ఆ తాలూకు అంచనాలని పలు రకాలుగా ఉదహరిస్తు కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఆ అంచనాల స్థాయిని మించి తెరకెక్కుతాయి. అలాంటి ఒక కాంబినేషన్ ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఈ ఇద్దరి కటౌట్స్ కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ ఇద్దరి 'స్పిరిట్' అధికారకంగా ప్రారంభమైనప్పట్నుంచి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో స్పిరిట్ అప్ డేట్ గురించి తెలుసుకోవడం తమ రోజువారి దినచర్యలో భాగమైంది. రీసెంట్ గా స్పిరిట్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


ప్రముఖ ఓటిటి సంస్థ స్పిరిట్ డిజిటల్ హక్కులని 160 కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని చెల్లించి పొందినట్టుగా సోషల్ మీడియా లేటెస్ట్ టాక్ .టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా సదరు టాక్ బాగానే వినిపిస్తుంది.ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని ఈ మధ్య కాలంలో షూటింగ్ ప్రారంభం కాకముందే అంత భారీ ధరకి కొనుగోలు చెయ్యడం అంటే రికార్డు అని చెప్పుకోవచ్చు. అగ్ర హీరోల సినిమా ఓటిటి హక్కులు పొందే విషయంలో ఓటిటి సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. అందుకే చాలా సంస్థలు సినిమా ప్రారంభ దశలోనే భారీ మొత్తంలో చెల్లించి స్ట్రీమింగ్ హక్కులని పొందుతాయి. పైగా ప్రభాస్, సందీప్ రెడ్డి ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో ఒక బెంచ్ మార్కుని సృష్టించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంత భారీ మొత్తంలో చెల్లించి ఓటిటి హక్కులు పొందారనే మాట సినీ పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్, సందీప్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం సదరు న్యూస్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read:అఖండ 2 కి పోటీగా వస్తున్నావా... నిలబడగలరా!


స్పిరిట్ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి ఇప్పటికే స్పిరిట్ గురించి చెప్తున్న పలు విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ఇంతరకు భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కని ఒక వైవిధమైన సబ్జెట్ తో తెరకెక్కబోతుంది. యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)హీరోయిన్. పాన్ ఇండియా యాక్టర్స్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.