Read more!

English | Telugu

సింగమలై ఊచకోత.. రీ రిలీజ్ సినిమాలలో సరికొత్త రికార్డు!

రీ రిలీజ్ సినిమాలలో 'సింహాద్రి' సంచలనం సృష్టించింది. మొదటిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన రీ రిలీజ్ సినిమాగా నిలిచింది. రీ రిలీజ్ సినిమాలలో మొదటిరోజు ఐదు కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన తొలి సినిమా 'సింహాద్రి'నే కావడం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'సింహాద్రి' చిత్రం 2003 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 20 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా నిన్న(మే 20) ఈ సినిమాని మళ్ళీ విడుదల చేయగా.. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలి, కొత్త సినిమా విడుదలకు చేసినంత హంగామా చేశారు. దీంతో ఈ సినిమా రికార్డు వసూళ్లు రాబట్టింది. నిన్న ఒక్కరోజే వరల్డ్ వైడ్ గా రూ.5.20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి, ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.

రీ రిలీజ్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా నిన్నటి వరకు రూ.4.15 కోట్ల గ్రాస్ తో ఖుషి టాప్ లో ఉండగా, ఇప్పుడు ఆ రికార్డుని సింహాద్రి బ్రేక్ చేసింది. ఇక రీరిలీజ్ లో అన్నిరోజులకు కలిపి ఖుషి మొత్తంగా రూ.7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సింహాద్రి జోరు చూస్తుంటే ఆ రికార్డు కూడా బ్రేక్ చేసేలా ఉంది.