English | Telugu

దేవుడు తగిన శాస్తే చేశాడంటున్న శృతి హాసన్ 

కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించి తన అద్భుతమైన నటనతో తెలుగు తమిళ హిందీ భాషల్లో అభిమానులని సంపాదించుకున్న నటి శృతి హాసన్. శృతిహాసన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంది. ఈ నెల 26 దాకా ఆగితే నా అభిమానులతో పాటు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు శృతి చేసిన ఒక ట్వీట్ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తుంది.

శృతి హాసన్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ద్వారా నాకు ఫీవర్ గా ఉందని తన అభిమానులకి చెప్తు వస్తుంది. ఫీవర్ రావడానికంటే ముందు నుంచే 26 వ తారీఖున అందరికి గుడ్ న్యూస్ చెప్తానని అంటూ ఉంది. దీంతో అందరు శృతి హాసన్ తన పెళ్లి గురించి చెప్తుందేమో అని అనుకుంటున్నారు. కానీ శృతిహాసన్ రీసెంట్ గా మరొక ట్వీట్ ని చేసింది. నాకు అంతకు ముందు జ్వరంగా ఉన్నా కూడా జ్వరం లేదని అబద్దం చెప్పి కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నానని అందుకే దేవుడు నాకు తగిన శాస్తి చేసాడని అంది. ఎందుకంటే అప్పుడు అలా అబద్దం చెప్పినందుకు దేవుడు నాకు జ్వరాన్ని ఎక్కువ చేసాడని తక్కువ జ్వరం కాస్త డెంగ్యూ గా మారిందని చెప్పింది. అలాగే దేవుడు 26 వ తారీకు లోపే తన డెంగ్యూ ఫీవర్ ని తగ్గిస్తాడని కూడా చెప్పింది.

శృతి హాసన్ తెలుగులో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించింది. అలాగే ఆమె సినిమాల విజయాలు శాతం కూడా ఎక్కువే. శృతి ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీ చేసింది. పాన్ ఇండియా మూవీ అయిన సలార్ లో శృతి టీచర్ గా నటిస్తుంది. సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి తన కెరీర్ మళ్ళీ జెట్ స్పీడ్ తో ముందుకు వెళ్లాలని శృతి కోరుకుంటుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.