English | Telugu

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన షారుఖ్‌

అత్తారింటికి దారేది... టాలీవుడ్‌లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించిన సినిమా. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ... ఈ సినిమా పేరుమీదే ఉన్నాయి. బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని, షారుఖ్ ఖాన్ అందులో క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని వార్త‌లొచ్చాయి. షారుఖ్ ఈ సినిమాని చూశార‌ని, ప‌వ‌న్ పాత్ర విప‌రీతంగా న‌చ్చి - ఈ సినిమా చేయ‌డానికి ఒకే చెప్పాడ‌ని చెప్పుకొన్నారు. అయితే అదంతా ఉత్తుత్తినేన‌ట‌. అస‌లు అత్తారింటికి దారేది సినిమాని షారుఖ్ చూడ‌లేద‌ట‌. ఇక రీమేక్ ప్ర‌స్తావ‌న ఎందుకొస్తుంది.?? ''అత్తారింటికి దారేది సినిమాని నేనేం రీమేక్ చేయ‌డం లేదు. అస‌లు ఆ సినిమా చూళ్లేదు. నిజానికి గ‌త కొంత కాలంగా ద‌క్షిణాది సినిమాల్ని చూడ‌డం లేదు'' అని షారుఖ్ ఓ ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు. సో... ప‌వన్ సినిమాని షారుఖ్ రీమేక్ చేస్తాడ‌ని చెప్ప‌డం క‌ట్టుక‌థే అన్న‌మాట‌.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.