English | Telugu

టాలీవుడ్ కి కలసిరాని సీక్వెల్స్!

హాలీవుడ్ లో ఒక్క సినిమా హిట్ అయితే చాలు...దానికి కొనసాగింపుగా సినిమాలు వస్తూనే ఉంటాయి. బాలీవుడ్, కోలీవుడ్ లోనూ సీక్వెల్స్ సందడి సాగుతుంటోంది. మేమేం తక్కువ అంటూ టాలీవుడ్ లోనూ సీక్వెల్స్ తో సత్తాచాటాలనుకుంటారు. కానీ హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో సీక్వెల్స్ కి ఉన్నఆదరణ టాలీవుడ్ లో లభించదు. కారణమేదైనా....సీక్వెల్స్ ఫ్లాప్ అంతే.

టాలీవుడ్ సినిమాలకు సీక్వెల్స్ కలసిరావు. ఇది లేటెస్ట్ మాట కాదు. ఎప్పటినుంచో ఇదే జరుగుతోంది. ఆర్య-2 నుంచి మొదలై అవును-2 వరకు సేమ్ సీన్ రిపీట్ అయింది. కానీ మన స్టార్స్ కి మాత్రం సీక్వెల్స్ పై అస్సలు మొజుతగ్గడంలేదు. సినిమా హిట్ అయిన వెంటనే మరుక్షణమే....దానికి కొనసాగింపు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ కు పాజిటివ్ టాక్ రావడంతో దానికి సీక్వెల్ తీస్తానని నిర్మాత బండ్ల గణేశ్ ఆ మధ్య చెప్పాడు. కళ్యాణ్ రామ్ 'పటాస్' కు కూడా సీక్వెల్ తీస్తామంటున్నారు. అయితే ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఆ సినిమా సంగతి పక్కనపెడితే...విడుదలకు సిద్ధంగా ఉన్న-విడుదలై ఫెయిలైన సీక్వెల్స్ ఏంటో చూద్దాం.



వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2. పవన్ అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తోన్న ఈ ప్రాజెక్టు ఈ నెల్లోనే సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. దీనితో పాటు 'స్వామి రారా' కు సీక్వెల్ గా సెట్స్ పై ఉంది మోసగాళ్లకు మోసగాడు. మరోవైపు కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ కూడా రణం-2తో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. రవితేజ- సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న కిక్-2 త్వరలోనే ఆడియన్స్ కు కిక్కించేందుకు సిద్ధమైంది. వీటిలో కిక్-2, రణం-2 కు మాత్రమే డైరెక్టర్స్ రిపీట్ అవుతుండగా.....గబ్బర్ సింగ్-2, మోసగాళ్లకు మోసగాడు వేరే దర్శకులు తెరెకెక్కిస్తున్నారు. డైరెక్టర్స్ మార్చాక అయినా సీక్వెల్స్ ఫెయిల్ అనే సెంటిమెంట్ కు చెక్ పెడదామనే ఆలోచనలో ఇలా చేశామని చెబుతున్నారు.



అయితే సీక్వెల్స్ కి దర్శకుడిని మార్చినా కానీ పెద్దగా ఫలితం ఉండదంటున్నారు. ఎందుకంటే గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ ను జయంత్ సి.పరాన్జీ తెరకెక్కించగా..... దాని సీక్వెల్ ను ప్రభుదేవా డైరెక్ట్ చేశాడు. చిరు- ప్రభుదేవా చేసిన గాంధీగిరి సీక్వెల్స్ తలరాతను మార్చలేకపోయింది. అలాగే గాయం- గాయం-2 సినిమాలకు కూడా వేర్వేరు దర్శకులు పని చేశారు. మనీ సీక్వెల్స్ లో మూడోదిగా వచ్చిన మనీ మనీ మోర్ మనీకి కూడా డైరెక్టర్ ను రిపీట్ చేయలేదు. దీంతో దర్శకుడు మారినా సీక్వెల్స్ తలరాత మారదనే సెంటిమెంట్ బలపడింది.



సేమ్ డైరెక్టర్ తెరకెక్కించిన సీక్వెల్స్ పరిశీలిస్తే....ఆర్యను సూపర్ హిట్ చేసిన సుకుమార్.. ఆర్య-2 విషయంలో ఆ మార్క్ చూపించలేకపోయాడు. చంద్రముఖితో లకలకలక అంటూ భయపెట్టిన పి.వాసు....నాగవల్లితో చతికిలపడ్డాడు. అవునుతో టెన్షన్ పెట్టిన రవిబాబు అవును-2తో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. సీక్వెల్స్ ను హిట్ చేయడానికి హీరోలు, దర్శకనిర్మాతలు ఎంత ప్రయత్నించినా...సక్సెస్ మాత్రం దోబూచులాడుతూనే ఉంది. అయినప్పటికీ సీక్వెల్స్ పై క్రేజ్ తగ్గకపోవడం విశేషం.

అటు బాలీవుడ్ లో పరిశీలిస్తే....మాధవన్-కంగనా కాంబినేషన్ లో వచ్చిన తనూ వెడ్స్ మను కి కొనసాగింపుగా తనూ వెడ్స్ మనూ రిటర్స్న్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండేళ్లక్రితం వచ్చిన ఏబీసీడీ కి కూడా సీక్వెల్ ముస్తాబవుతోంది. కోలీవుడ్ లో కూడా ఈ తరహా చిత్రాలకు మంచి క్రేజ్ లభిస్తోంది. మాస్ హీరో సూర్య నటించిన సింగం, సింగం-2 తమిళనాట ఘన విజయం సాధించాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ముని సిరీస్ లకు కూడా అక్కడ మంచి కలెక్షన్లు వసూలవుతున్నాయి. ప్రస్తుతం గంగ థియోటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

మరి విడుదలకు సిద్ధంగా ఉన్న సీక్వెల్స్ తో టాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవుతుందో....ట్రెండ్ సెట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.