English | Telugu

ప‌వ‌న్‌ని ఇంకా న‌మ్ముతున్నాడు

గ‌బ్బ‌ర్ సింగ్ 2 సినిమా విష‌యంలో సంత‌ప్‌నందికి చుక్కెదురు అయ్యింది. ఈ సినిమా కోసం సంపత్ దాదాపు రెండేళ్లు ఎదురుచూశాడు. ప‌వ‌న్ అభిరుచికి త‌గ్గ‌ట్టు స్ర్కిప్టులో మార్పులు కూడా చేశాడు. కానీ.. ఈ సినిమా నుంచి సంప‌త్ నందిని త‌ప్పించి మ‌రో ద‌ర్శ‌కుడు (బాబిని అనుకొంటున్నారు) ఎంచుకొన్నార‌ని వార్త‌లొస్తున్నాయ్‌. అయితే చిత్ర‌బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. దాంతో సంప‌త్‌నందిలో ఆశ‌లూ చావ‌లేదు. ''ఈ సినిమాపై ఎంతో న‌మ్మ‌కం పెట్టుకొన్నా. ఇంత కాలం వెయిట్ చేశా. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై న‌మ్మ‌కం ఉంది. ఆయ‌న న‌న్ను మోసం చేయ‌రు'' అని సంప‌త్ స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతున్నాడ‌ట‌. ప‌వ‌న్‌కి ఇంకా న‌మ్ముతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌ని క‌లుస్తాన‌ని, గ‌బ్బ‌ర్ సింగ్ 2 పూర్తి స్ర్కిప్టు చ‌దివి వినిపిస్తాన‌ని, ప‌వ‌న్ ఓకే అంటాడన్న న‌మ్మ‌కం ఉంద‌ని చెప్తున్నాడ‌ట‌. అయితే సంప‌త్ నంది స‌న్నిహితులు మాత్రం... అత‌న్ని వారిస్తున్నారు. ప‌వ‌న్‌ని క‌లిసి లాభం లేద‌ని, ర‌వితేజ సినిమాపై దృష్టిపెట్ట‌డం కంటే గ‌త్యంత‌రం లేద‌ని చెప్తున్నార‌ట‌. కానీ సంప‌త్‌లో ఆశ‌లు చావ‌లేదు. మ‌రి ప‌వ‌న్, సంప‌త్‌నంది మొర ఆల‌కిస్తాడో, లేదో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.