English | Telugu

పవన్ తో సినిమా.. ఒక్క ఫోన్ కాలే దూరం

సంపత్ నంది..ఫస్ట్ చిన్న సినిమా చేసి, అందరి దృష్టిని తన వైపు తిప్పుకుని, రామ్ చరణ్ పిలుపు అందుకుని రచ్చ..చేసాడు. ఆ వెంటనే పవర్ స్టార్ దృష్టిని ఆకర్షించాడు. గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ మీద ఏడాది కృషి చేసాడు. బ్యాడ్ లక్. ఎక్కడో ఏదో జరిగింది..కానీ కష్టం ఎక్కడికీ పోదు. అందుకే రవితేజ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా 60శాతం పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ తో మాత్రం ఎప్పటికైనా సినిమా చేసి తీరతానని అంటున్నాడు ఈ యువ దర్శకుడు.

''గబ్బర్ సింగ్ సినిమా ఆగిపోయిన తరువాత మీడియాలో అనేక రూమర్లు వచ్చాయి. అవేం నిజం కాదు..కొన్ని పరిస్థితులే కారణం. పవన్ కళ్యాణ్ మా మధ్య ఎంతో స్నేహానుబంధం ఉంది. మా ఇద్దరి మధ్య దూరమల్లా - ఒక్క ఫోన్ కాలే!'' అని అంటున్నాడు సంపత్ నంది. బెంగాల్ టైగర్ అందరూ అనుకుంటున్నట్లు పోలీసు కథ కాదట, హీరో క్యారెక్టరైజేషన్, స్క్రీన్‌ప్లే బేస్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అంటా. ఈ సినిమా సెప్టెంబర్ 18 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.