English | Telugu

ఒకరోజు ముందే 'బాహుబలి' చూడవచ్చు

రెండేళ్లుగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి. జులై 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే దానికి ఒకరోజు ముందుగానే ఈ సినిమాను జనం చూసే అవకాశం వుందట.

హిందీలో ఈ సినిమా హక్కులు కొన్న కరణ్ జోహార్ సినిమాను బాలీవుడ్ పెద్దలకు ముందే చూపించాలని డిసైడ్ అయ్యారట. జులై 9న ముంబైలో బాహుబలి గ్రాండ్ ప్రీమియర్ షోను ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రీమియర్ కి బాలీవుడ్ సూపర్ స్టార్లు హాజరవుతారని తెలుస్తోంది.

అలాగే ఆంధ్రా, తెలంగాణాలో కూడా భారీ ప్రీమియర్లు వుంటాయని సమాచారం. దాని కోసం ఇప్పటి నుంచే చాలా మంది కొనుగోళ్లు, ఏర్పాట్లు చేసుకుంటున్నారట. సో ఒకరోజు ముందే బాహుబలి రిజల్ట్ బయటకు రాబోతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.