English | Telugu

సినిమాలకు బ్రేక్ ఇస్తున్న సమంత!

సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని కాస్త కోలుకున్న ఆమె, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. మయోసైటిస్ వార్త తెలిశాక ఆమె నటించిన 'యశోద', 'శాకుంతలం' సినిమాలు విడుదలయ్యాయి. అందులో 'యశోద' విజయం సాధించగా, 'శాకుంతలం' పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆమె 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' సిరీస్ లో నటిస్తున్నారు. అయితే వీటి తర్వాత కొంతకాలం నటనను దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారట.

మయోసైటిస్ కి ముందు వరుస సినిమాలు చేసిన సమంత ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించారు. చేతిలో ఉన్న ఒకట్రెండు ప్రాజెక్ట్ లు తప్ప కొత్తవి అంగీకరించట్లేదు. బ్రేక్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇతర ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పట్లేదని అంటున్నారు. 'ఖుషి', 'సిటాడెల్' పూర్తయ్యాక ఆమె ఒక ఏడాది బ్రేక్ తీసుకోనున్నారట. మయోసైటిస్ కి అవసరమైన చికిత్స, విశ్రాంతి తీసుకొని.. మరింత దృఢంగా తిరిగి రావాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాలో సమంత నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.