English | Telugu

Samantha : డోస్ పెంచిన సమంత.. బజార్ లో రెచ్చిపోయింది!

తెలుగునాట స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో సమంత ఒకరు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. ఈ ఏడాది విడుదలైన 'శాకుంతలం', 'ఖుషి' బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు లేవు. హెల్త్ పూర్తిగా సెట్ అయ్యేవరకు సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సినిమాలు చేయనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత పేరు మారుమోగిపోతోంది. ఆమె లేటెస్ట్ హాట్ ఫొటోలు చూసి అభిమానులతో పాటు అందరూ షాక్ అవుతున్నారు.

సమంత తాజాగా 'బజార్ ఇండియా' అనే మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేసింది. అయితే ఆ ఫొటోలలో సమంతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. స్విమ్ సూట్ ని తలపించే బ్లాక్ డ్రెస్ లో సమంతని చూసి ఆమె అభిమానులే షాక్ అవుతున్నారు. అలాగే ఓ ఫొటోలో బ్యాక్ చూపిస్తూ, మరో ఫొటోలో షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి.. సమంత హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి.

నాగచైతన్యతో విడాకులు, ఆరోగ్య సమస్యలు వంటి కారణాలతో మొన్నటివరకు సమంతపై అందరిలో సానుభూతి ఉండేది. అయితే ఇప్పుడు ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మొన్నటివరకు అనారోగ్యం, ధ్యానం వంటి కబుర్లు చెప్పి.. ఇప్పుడు శరీర భాగాలను చూపిస్తూ ఇంతలా గ్లామర్ షో చేయడం అవసరమా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సమంత లేటెస్ట్ ఫొటోల పట్ల ఫ్యాన్స్ సైతం డిజప్పాయింట్ అవుతున్నారు. మొన్నటివరకు ఆమెని సపోర్ట్ చేసినవాళ్ళే.. ఈస్థాయి అందాల ఆరబోత అవసరమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్, హాలీవుడ్ పైన దృష్టి పెడుతుందని.. అందుకే ఈ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.