English | Telugu

స‌మంత దుకాణం క్లోజ్‌

ఒక‌ప్పుడు స‌మంత అన‌గానే.. ఆమె కాల్షీట్లు దొర‌క‌వు బాబోయ్‌.. అనుకొనేవారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇటు తెలుగులోనూ, అటు త‌మిళంలోనూ చేతినిండా సినిమాల‌తో అంత బిజీగా ఉండేది మ‌రి. ఇప్పుడంత సీన్ లేదు. త‌మిళం మాటేమోగానీ.. తెలుగులో ప్ర‌స్తుతానికి ఖాళీ అయిపోయింది స‌మంత‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌వాత ఆమె ఒక్క తెలుగు సినిమాపైనా సంత‌కం చేయ‌లేదు. ఆ మాట‌కొస్తే.. ఆమెకు అవ‌కాశాలే రాలేదు. కొత్త‌మ్మాయిలు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ఆదాశ‌ర్మ‌లాంటివాళ్లు స‌మంత‌కు గ‌ట్టిషాక్ ఇచ్చారు. ఈ కుర్ర హీరోయిన్ల‌తో పోటీకి త‌ట్టుకోలేక‌పోతోంది స‌మంత‌. దానికి తోడు.. గ్లామ‌ర్ కూడా రోజురోజుకీ త‌గ్గిపోతోంది. మొఖ‌క‌వ‌ళిక‌ల్లో మార్పు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచీ ఆమెలో గ్లామ‌ర్ మ‌టుమాయ‌మైపోతోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిల‌తోనూ స‌మంత చేసిందేం లేదు. స‌మంత కావాలంటే కోట్లు పెట్టాలి. అదే ర‌కుల్‌, ఆదాలాంటి వాళ్ల‌ని తీసుకొంటే ల‌క్ష‌ల్లో తేలిపోతుంది. అందుకే స‌మంత‌ని తెలుగులో ద‌ర్శ‌క నిర్మాత‌లు లైట్ తీసుకొన్నారు. దాంతో తెలుగులో స‌మంత దుకాణం దాదాపుగా క్లోజ్ అయిపోయింది. తెలుగులో మ‌ళ్లీ ఇదివ‌ర‌క‌టిలా అవ‌కాశాలు రాక‌పోతాయా?? అని ఎదురుచూస్తోందీ అమ్మ‌డు. మ‌రి.. క‌నిక‌రించే నాధులు ఎవ‌రో..??

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.