English | Telugu

ఎవడు టూర్ లో సాయికుమార్ విలనిజం

రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర సకెస్స్ టూర్ లో ఉత్సాహంగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో సాయికుమార్ విలన్ పాత్రలో, ప్రముఖ నటుడు ఎల్.బి.శ్రీరామ్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. అయితే ఈ సక్సెస్ టూర్ లో పాల్గొన్న ఎల్.బి. మాట్లాడుతూ సినిమాలోని తన డైలాగ్ ను చెబుతూ, విలన్ (సాయి కుమార్) పై చమత్కారంగా డైలాగ్ విసిరాడు. దానికి సాయికుమార్ స్పందిస్తూ.. ఎల్.బి.శ్రీరామ్ గొంతును పట్టుకొని తన విలనిజం చూపించాడు. కంగారు పడకండి.. అది కూడా సరదాగా మాత్రమే చేసాడు. ప్రస్తుతం ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబడుతుంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.