English | Telugu

సాయికుమార్ చిత్రం ప్రారంభం

సాయికుమార్ చిత్రం ప్రారంభం అయ్యింది. వివరాల్లోకి వెళితే పద్మిని ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై, డైలాగ్ కింగ్ సాయికుమార్, హేమ జిల్లోజ్ హీరోయిన్ గా, కేశవ తీర్థ, ప్రభాకర్, అశోక్ కుమార్ ప్రథాన తారాగణంగా, రామ్ కుమార్ దర్శకత్వంలో,యస్.యన్.రావు, హెచ్.వేంకటేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న "ప్రొడక్షన్ నం-2" మే 5 వ తేదీన ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభమయ్యింది.

ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి క్లాప్ కొట్టగా, యువ హీరో, పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరామ్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ముహూర్తం షాట్ కు దర్శకుడు యన్.శంకర్ గౌరవ దర్శకత్వం వహించగా, ఈ చిత్రం వైభవంగా ప్రారంభమయ్యింది. ఈ చిత్ర నిర్మాతలు ఇదే పతాకంపై, ఆలీ హీరోగా ఇదే రామ్ కుమార్‍ దర్శకత్వంలో "తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా" అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం తర్వాత వారు నిర్మిస్తున్న రెందవ చిత్రమిదే కావటం విశేషం.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.