English | Telugu

మాస్ జాతర తర్వాత రవితేజ విజ్ఞప్తి..!

ఇటీవల 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజా రవితేజ. వరుస పరాజయాల్లో ఉన్న రవితేజ, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూశారు. కానీ, 'మాస్ జాతర' కూడా మెప్పించలేకపోయింది. దీంతో నెక్స్ట్ సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

రవితేజ తన 76వ సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ, 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇదే టైటిల్ ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా మేకర్స్ ఒక పోస్టర్ ను వదిలారు. రవితేజ నమస్కారం చేస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

Also Read: తెలంగాణ సాహితీ శిఖరం 'అందెశ్రీ' కంటతడి పెట్టిన సందర్భం..!

'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ ని బట్టి చూస్తే.. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ లో ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాగే దర్శకుడు కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని అందించడంలో దిట్ట. అలాంటిది ఈ ఇద్దరు కలిసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే టైటిల్ తో వస్తున్నారంటే.. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

మరి ఈ సినిమాతో రవితేజ అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చి.. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారేమో చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.