English | Telugu

'గేమ్ చేంజర్'గా రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమాని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్-శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నేడు(మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'RC 15' టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి 'గేమ్ చేంజర్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. శంకర్ శైలిలో డిజైన్ చేసిన టైటిల్ లోగో ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ సినిమాకి 'ఆఫీసర్', 'సర్కారోడు', 'సీఈఓ' వంటి టైటిల్స్ ని పరిశీలించినట్లు వార్తలొచ్చాయి. కానీ అనూహ్యంగా 'గేమ్ చేంజర్'ని ఫైనల్ చేశారు. పాన్ ఇండియా మూవీకి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

'గేమ్ చేంజర్' ఫస్ట్ లుక్ కూడా ఈరోజే విడుదల కానుంది. మధ్యాహ్నం 3:06 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. టైటిల్ కి తగ్గట్లే ఫస్ట్ లుక్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.