English | Telugu

రష్మీ మేకప్ మాన్ మృతి.. కన్నీళ్ళు తెప్పిస్తున్న నిజం 

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి మేకప్ మాన్ గా వర్క్ చేస్తు వస్తున్నారు 'వేణు'(Venu). ప్రస్తుతం ప్రముఖ నటి, జబర్దస్త్ షో యాంకర్ 'రష్మీ'(Rashmi Gautam)కి పర్సనల్ మేకప్ మాన్ గా చేస్తు పరిశ్రమలోనే సీనియర్ మేకప్ మాన్ గా గుర్తింపు పొంది,కెరీర్ పరంగా ఎన్నో అవార్డుల్ని సైతం అందుకున్నాడు.

రీసెంట్ గా వేణు నిన్న రాత్రి హైదరాబాద్ కృష్ణానగర్ ఏరియాలో రాత్రి పది గంటలకి ఆర్ టి సి బస్ కింద పడి చనిపోవడం జరిగింది. సమీపంలోనే ఉన్న మేకప్ యూనియన్ మీటింగ్ లో పాల్గొని వస్తుండగా ఆ సంఘటన జరిగింది. ఊహించని ఈ సంఘటనతో చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. వేణు కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.

హైదరాబాద్ లోని సినీ కార్మికులకి నిలయమైన చిత్రపురి కాలనీలో వేణు నివాసం ఉంటుండగా . ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక ప్రమాద సంఘటనకి కారణమైన బస్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.