English | Telugu

ప్రముఖ గాయనీమణి మృతి.. తొలి తెలుగు పాట ఆమెదే 

పాట తన యొక్క మాధుర్యాన్నిప్రేక్షకులకి పంచడానికి తన వరప్రసాదంగా కొంత మందిని భూమ్మీదకి పంపిస్తుంది. అలాంటి వాళ్ళల్లో 'రావు బాలసరస్వతిదేవి'(Rao Bala Saraswathi devi)గారు ఒకరు. పాటకి ఆమె వల్లే పేరు వచ్చిందని కూడా చెపుకోవచ్చు. ఆ గాత్ర మాధుర్యం వింటే మనుషులే కాదు ప్రకృతి సైతం పరవశించిపోతుంది. ఎంటైర్ దక్షిణ చలన చిత్ర పరిశమ్రలోనే మొట్టమొదటి గాయనీమణి కూడాను. రేడియోలు రాజ్యమేలుతున్న కాలంలో తెలుగు ఆకాశవాణిలో వచ్చిన మెజారిటీ పాటలన్ని ఆమెవే. తెలుగు సినిమాకి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆమె సొంతం.దీంతో 'లలిత సంగీత సామ్రాజ్ఞి' గా పేరు గడించింది. తొలి తెలుగు సోలో గ్రామ్ ఫోన్ ఫోన్ రికార్డు కూడా ఆమెదే.

ఈ రోజు ఉదయం'రావు బాలసరస్వతి దేవి గారు భువి నుంచి దివికి చేరారు. పాటని, లలిత సంగీతాన్ని తన అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచుతు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు కాగా వృద్దాప్య సమస్యల వల్లనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటకి సంబంధమున్న ప్రతిఒక్కరు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆరవ యేట నుంచే పాటలు పాడటంలో ప్రావిణ్యం సంపాదించిన బాలసరస్వతిదేవి గారు 1939 లో వచ్చిన మహానంద అనే సినిమాలో మొదటి సారిగా ఆలపించారు.

సతీఅనసూయ, ఇల్లాలు, పరమానందయ్య శిష్యుల కథ, లైలా మజ్ను, షావుకారి, పిచ్చి పుల్లయ్య, తెనాలి రామకృష్ణ, దాంపత్యం ఇలా పలు చిత్రాల్లోని పాటలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. సుదీర్ఘ కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ కలుపుకొని సుమారు 2000 పాటల వరకు పాడారు. 1928 ఆగస్ట్ 28 న జన్మించగా, స్వస్థలం గుంటూరు. ఆమె తన చివరి ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ గాయనిగానే పుడతానని చెప్పుకొచ్చారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.