English | Telugu

రానా, జెనీలియా జంటగా చిత్రం

రానా, జెనీలియా జంటగా ఒక చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే "లీడర్‍" ఫేం యువ హీరో దగ్గుపాటి రానా హీరోగా, హాసిని పాప జెనీలియా హీరోయిన్ గా ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, యునైటెడ్ మూవీస్ పతాకంపై, గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం" సింహా" వంటి చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత పరుచూరి కిరీటి ఒక చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం ఏప్రెల్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం.

ఈ చిత్రం ఒక విభిన్నమైన కథతో నిర్మించబడుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రకాష్ తోలేటి ప్రముఖ యువదర్శకుడు సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. గతంలో కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన "ఈనాడు" చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటికి ఈ ప్రకాష్ తోలేటికి ఏదైన్నా చుట్టరికముందేమో తెలియదు. ఇద్దరి ఇంటి పేర్లు మాత్రం ఒక్కటే కావటం గమనార్హం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.