English | Telugu

'బాహుబలి 2' హంగామా మొదలైంది

రాజమౌళి లేటెస్ట్ మూవీ 'బాహుబలి-2' మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో కొంతమందిని రాజమౌళి నిరాశ పరిచినా.. మెజారిటీ ఆడియన్స్ను మెప్పించాడు. బాహుబలికి దేశవ్యాప్తంగా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బహుశా రాజమౌళికి కూడా ఆశ్చర్యం కలుగుతుండొచ్చు. సినిమా చూసిన వాళ్లంతా బాహుబలి-2 ఎప్పుడు రాజమౌళి అని అడుగుతున్నారు.

ఇప్పటికే బాహుబలి-2 మీద భారీ అంచనాలు మొదలైపోయాయి. ఇంతలోనే ఆ అంచనాల్ని మరింత పెంచేసేలా మాట్లాడాడు దగ్గుబాటి రానా. ''బాహుబలి ది కన్క్లూజన్ వచ్చాక.. బాహుబలి ది బిగినింగ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది. రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలు ఎమోషన్స్ సెట్లు భారీతనం.. అన్నీ కూడా ఫస్ట్ పార్ట్ కంటే గొప్పగా ఉంటాయి'' అని చెప్పాడు రానా. సినిమాలో తన పాత్రకు ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ తాలూకు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుందన్న రానా.. షూటింగ్లో పడ్డ కష్టం అంతా సినిమా సాధించిన విజయం చూశాక దూదిపింజలా ఎగిరిపోయిందని అన్నాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.