English | Telugu

రామానాయుడు గురించి కొన్ని ముఖ్యవిషయాలు

అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నిర్మాత రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి మొదలైన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రామానాయుడు స్టూడియోలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అధికారిక లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామానాయుడు గురించి కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం:

* రామానాయుడు తండ్రి ఓ రైతు.
* రామానాయుడు స్వగ్రామం ప్రకాశం జిల్లా కారంచేడు.
* సినిమా హీరో కావాలని కోరిక, ఎంతో మందిని హీరో చేసినా ఆయన కాలేకపోయాడు.
* ఆయన రాముడు-భీముడు సినిమాలో లాయరుగా తెరపై కనిపించాడు.
* గిన్నిస్ బుక్ ఎక్కిన ఏకైక నిర్మాత.
* బాపట్ల ఎంపీగా తొలిసారే రాజకీయాల్లో నెగ్గారు.
* సినిమాలకు ముందు ఓ రైస్ మిల్లు నడిపాడు.
* ఆయన సురేష్ ప్రొడక్షన్ స్థాపించి తీసిన తొలి సినిమా రాముడు-భీముడు సూపర్ హిట్.
* ఆయన ఆస్తులన్నీ అమ్మి తీసిన సినిమా ప్రేమనగర్. ఇది అరికెపూడి కౌసల్యాదేవి రాసిన నవల.
* ఆయన పరిచయం చేసిన దర్శకులు: శేషగిరి రావు, బాపయ్య, బోయిన సుబ్బారావు, నగేష్, కె.మురళీమనోహర్ రావు, బి.గోపాల్, వై.నాగేశ్వరరావు, కె.సదాశివరావు, జయంత్, ఏవీఎస్, తిరుపతిస్వామి, చంద్రమహేష్, ఉదయ్ శంకర్.
* రామానాయుడు బెంగాలీలో నిర్మించిన అసుఖ్ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది.
* కేవలం 37 సంవత్సాల్లోనే ఆయన వంద సినిమాలు నిర్మించాడు.
* ప్రజా సేవ కోసం రామనాఆయుడు చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు.
* ఆయన నెలకొల్సిన సంస్థలు: రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు ఫిలిం ప్రొడక్షన్, రామానాయుడు అవుట్ డోర్ యూనిట్, రికార్డింగ్ థియేటర్స్, కలర్ ల్యాబ్, రామానాయుడు ఆడియోస్, డబ్బింగ్ థియేటర్స్, సురేష్ ఆఫ్ సెట్ ప్రింటర్స్, డిస్ట్రిబ్యూటర్, రాజేశ్వరి ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్, రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్, సురేష్ ఓవర్సీస్ కమోడిటీస్ .
* నర్సాపూర్ సమీపంలో పదెకరాల్లో ఓ వృద్ధాశ్రమం,ఐదెకరాల్లో అనాథ శరణాలయాన్ని ఏర్పాటుచేసి ఆయనే పోషిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.