English | Telugu

ట్రోల‌ర్స్‌కి ఫొటోతో క్లారిటీ ఇచ్చిన రామ్‌

యంగ్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న గ‌త చిత్రం స్కంద థియేట‌ర్స్‌లో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక‌పోయింది. ఇప్పుడు సినిమా ఓటీటీలో ర‌న్ అవుతోంది. అయితే ఇక్క‌డే అస‌లు చిక్కొచ్చి ప‌డింది. అదేంటంటే సినిమాలో జ‌రిగిన మేకింగ్ త‌ప్పుల‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్ జ‌రుగుతున్నాయి. ముందు సీన్‌లో చ‌నిపోయిన విల‌న్, కొంత‌సేప‌టి త‌ర్వాత మెయిన్ విల‌న్ వెనుకున్న విల‌న్ గ్యాంగ్‌లో క‌న‌డ‌టంతో పాటు రామ్‌కి బాడీ డ‌బుల్‌గా డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను న‌టించాడు. ఈ విష‌యాల‌కు సంబంధించిన వీడియోల‌ను ప‌ట్టుకున్న‌ నెటిజ‌న్స్ స్కంద సినిమాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేయ‌టం ప్రారంభించారు.

ఇక లాభం లేద‌ని అనుకున్నారేమో హీరో రామ్ ఏకంగా రంగంలోకి దిగారు. క్లైమాక్స్‌ను చిత్రీక‌రించ‌టానికి 25 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. అందులోనూ వేస‌వి కాలం. మూడో రోజు రామ్ పాదంలో ప‌గుళ్లు వ‌చ్చేశాయి. దీంతో త‌ను న‌డ‌వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది. త‌న కాలి పాదం ఫొటోను షేర్ చేసిన రామ్.. ‘నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. మూడో రోజు న‌డ‌వ‌టానికి నాకు వీలు కాలేదు. పాదం నుంచి ర‌క్తం కారుతోంది. దాంతో మా డైరెక్ట‌ర్ నన్ను రెస్ట్ తీసుకోమ‌ని చెప్పి, నా బ‌దులుగా ఒకే ఒక సీన్‌లో న‌టించారు. న‌చ్చ‌టం, న‌చ్చ‌క‌పోవ‌టం అనేది ఆడియెన్స్‌కే వ‌దిలేస్తున్నాను. ఏది చేసినా మీ కోస‌మే. అయితే నా డైరెక్ట‌ర్ ఆ సీన్‌లో న‌టించినందుకు ఆయ‌న‌కు థాంక్స్ చెబుతున్నాను. ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా ర‌క్తం, చెమ‌ట చిందించి సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్టం ప‌డ్డాం’ అని అన్నారు హీరో రామ్.

సినిమా కోసం హీరోలు ఎంత క‌ష్ట‌ప‌డ‌తార‌నే విష‌యాన్ని మ‌రోసారి రామ్ వివ‌రించారు. ఇప్పుడు ఆయ‌న అభిమానులు అండ‌గా నిల‌బ‌డుతున్నారు. త‌న క‌ష్టానికి విలువ ఇవ్వాల‌ని అంటున్నారు. స్కంద సినిమాకు మ‌రి రెండో పార్ట్ ఉంది. మ‌రి దీన్ని చిత్రీక‌రిస్తారా? లేదా అని రామ్‌, బోయ‌పాటి చెప్పాలి. మ‌రి బోయ‌పాటి నెక్ట్స్ సినిమాను బాల‌య్య‌తో చేస్తారా? లేక మ‌రెవ‌రితోనైనా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.