English | Telugu

వ‌ర్మ ఎవ‌రి ఎఫైర్లు బ‌య‌ట‌పెడ‌తాడో..

వ‌ర్మ చుట్టు వివాదాలు తిరుగుతాయో, లేదంటే వ‌ర్మ నే వివాదాల చుట్టూ తిరుగుతాడో తెలీదు గానీ వ‌ర్మ న్యూస్ మేక‌ర్ అయిపోయాడు. వ‌ర్మ ఎఫైర్లు అనే టాపిక్ మీద ఓ పుస్త‌క‌మే రాయొచ్చు. దాదాపు తాను ప‌నిచేసిన అంద‌రు హీరోయిన్ల‌తోనూ స‌న్నిహితంగా ఉన్నాడు. వాళ్ల‌తో వ‌ర్మకు మీడియా చాలాసార్లు లింకులు క‌ట్టి.. వార్త‌లు సృష్టించింది. ఇప్పుడు వ‌ర్మ కూడా ఆ ఎఫైర్ల‌ను తెర‌పై చూపించ‌బోతున్నాడు. వ‌ర్మ తాజాగా స‌చిన్ జోషీని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తున్నాడు. ఆ సినిమా పేరు ఎఫైర్‌! తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సినిమా పేరుని బ‌ట్టి చెప్పేయొచ్చు, కంటెంట్‌లో ఎంత మ‌సాలా ఉంటుందో. బాలీవుడ్, టాలీవుడ్‌లోని ఎఫైర్ల‌ను వ‌ర్మ ఈ సినిమా ద్వారా బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాడ‌ని స‌మాచారం. హై ఫై సొసైటీలో అక్ర‌మ సంబంధాలు ఎలా సాగుతున్నాయో... ఎఫైర్ ద్వారా చూపించ‌బోతున్నాడ‌ట‌. తాను చూసిన‌, విన్న (అనుభవించిన ) సంఘ‌ట‌న‌లూ ఈసినిమాలో పొందు ప‌ర‌చ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మొత్తానికి వ‌ర్మ మ‌రోసారి టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌ను కుదిపేసే మేట‌ర్‌తో వ‌స్తున్నాడు. మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూద్దాం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.