English | Telugu

‘స్కంద’ లో రామ్ ద్విపాత్రాభినయం!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ‘స్కంద’ సినిమా ఈ సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన పంథాలో ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్‌గా రిలీజైన స్కంద ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అవగతమవుతుంది. ఇందులో గమనిస్తే రామ్ రెండు లుక్స్‌లో కనిపిస్తున్నారు. అసలు ఇలా కనిపించటానికి కారణం తనేమైనా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్న కూడా అందరి మదిలో మెదిలింది. అయితే సినీ సర్కిల్స్ లేటెస్ట్ సమాచారం మేరకు ‘స్కంద’ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేశారట.

ఇదే కనుక నిజమైతే రామ్ ఇలా ద్విపాత్రాభినయం చేయటం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు రెడ్ చిత్రంలో ఈ యంగ్ ఉస్తాద్ డబుల్ రోల్‌లో కనిపించి అలరించిన సంగతి తెలిసింతే. ఇప్పుడు స్కంద సినిమాలోనూ డ్యూయెల్ పాత్రలతో రామ్ ఆకట్టుకోబోతున్నారు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న రిలేషన్.. వేరియేషన్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందేనట. బోయపాటి శ్రీను తన సినిమాల్లో నందమూరి బాలకృష్ణనే డ్యూయెల్ రోల్‌లో చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ రామ్ వంతు వచ్చింది. ఇది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇది. అది కూడా పాన్ ఇండియా చిత్రంగా. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటించింది. తమన్ సంగీత సారథ్యాన్ని వహించారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేసిన సినిమా కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే తమ తొలి పాన్ ఇండియా ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలని బోయపాటి శ్రీను, రామ్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేద్దామని ప్రకటన ఇచ్చారు. ఎప్పుడైతే సలార్ మూవీ వాయిదా పడుతుందనే విషయంలో తెలిసిందో.. అప్పుడు స్కంద మూవీ సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.