English | Telugu

సుకుమార్ ప్రాజెక్ట్.. ఊహించని షాకిచ్చిన రామ్ చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' (Peddi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. 2026 జనవరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశముంది అంటున్నారు. అయితే 'పెద్ది' షూటింగ్ పూర్తి కాగానే.. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా చరణ్ వెంటనే తన నెక్స్ట్ మూవీతో బిజీ కాబోతున్నారట.

రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో చేయనున్నాడు. 'రంగస్థలం' కాంబినేషన్ కావడంతో పాటు, 'పుష్ప' తర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో.. కేవలం ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా సుకుమార్ అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్ధం చేశారట. గతంలో 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ లో రాజమౌళి సైతం ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఓపెనింగ్ సీక్వెన్స్ తనకు తెలుసని, అది చూసి ప్రేక్షకులు ఫిదా అవుతారని అన్నారు. దాంతో చరణ్-సుకుమార్ ప్రాజెక్ట్ పై అందరి ఆసక్తి రెట్టింపు అయింది. (RC17)

ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2026 ఫిబ్రవరి నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని సమాచారం. అంటే రామ్ చరణ్ జనవరిలో 'పెద్ది' పూర్తి చేసి, వెంటనే ఫిబ్రవరిలో సుకుమార్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టనున్నాడు అన్నమాట. నిజానికి చరణ్ 'పెద్ది' సినిమాలా మేకోవర్ కోసం టైం తీసుకుంటాడేమో, సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుందేమోనని భావించారంతా. కానీ, రామ్ చరణ్ మాత్రం తన స్పీడ్ తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు.

సుకుమార్ డైరెక్ట్ చేసిన 'రంగస్థలం' సినిమా నటుడిగా చరణ్ కి గొప్ప పేరు తీసుకొచ్చింది. అలాగే కమర్షియల్ గానూ బిగ్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు 'రంగస్థలం'కి మించిన సినిమాని అందించే పనిలో సుకుమార్ ఉన్నారు. అందుకే 'పుష్ప-2' విడుదలయ్యాక ఈ మూవీ స్క్రిప్ట్ కి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి దాదాపు ఏడాది సమయం తీసుకొని.. పక్కా ప్లానింగ్ తో షూట్ కి వెళ్తున్నారని చెబుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.