English | Telugu

ద‌మ్ముంటే పోటీ అక్క‌డ ప‌డాలంటున్న రకుల్‌

ర‌కుల్ ప్రీత్‌సింగ్‌ది ఎప్పుడూ ముక్కుసూటి వ్య‌వ‌హార‌మే. మ‌న‌సులో ఒక‌టి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడ‌టం ఆమెకు అస‌లు చేత‌కాదు. న‌చ్చినా అంతే ఓపెన్‌గా చెప్పేస్తారు. న‌చ్చ‌క‌పోయినా అంతే. నిర్మాత జాకీ భ‌గ్నానితో ప్రేమ వ్య‌వ‌హారాన్ని కూడా ఆమె ఎంతో కాలం దాచ‌లేదు. అయినా అందులో దాచుకోవ‌డానికి ఏముంది? మా ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒకరికి ఇష్టం అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెప్పేశారు. రీసెంట్‌గా ఓ ఇష్యూ గురించి కూడా ఇదేవిధంగా ఓపెన్ అయ్యారు. ``సౌత్ సినిమాల్లో ప్ల‌స్సులేంటి? నార్త్ సినిమాల్లో ప్ల‌స్సులేంటి? అక్క‌డ సినిమాలు బావుంటాయా? ఇక్క‌డ సినిమాలు బావుంటాయా? మిమ్మ‌ల్ని కెరీర్ స్టార్టింగ్‌లో తీర్చిదిద్దింది సౌత్ సినిమా క‌దా.

మ‌రి నార్త్ సినిమాల్లో సెటిల్ అయ్యారేంటి? అంటూ నానా ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంటాయి నాకు. అరే యార్‌... ఎక్క‌డుండే ప్ల‌స్‌లు అక్క‌డుంటాయి. ఎక్క‌డుండే మైన‌స్‌లు అక్క‌డుంటాయి. అయినా ఇప్పుడు మ‌న‌తో మ‌నం పోల్చుకుని, మ‌న‌తో మ‌నం పోటీప‌డితే ఏం వ‌స్తుంది? మ‌న దేశంలో అత్యుత్త‌మ‌మైన టెక్నీషియ‌న్లున్నారు. అద్భుతంగా న‌టించే న‌టీన‌టులున్నారు. వారంద‌రూ ఏకం కావాలి. మంచి కథ‌తో సినిమాలు చేయాలి. అప్పుడే మ‌నం ఇంట‌ర్నేష‌న‌ల్ లెవల్లో మిగిలిన వాళ్ల‌తో పోటీప‌డ‌గ‌లం. అంత‌ర్జాతీయ స్థాయిలో గ‌ట్టిగా పోటీ ఇవ్వ‌గ‌లిగిన స‌త్తా ఉన్న వాళ్లం మ‌నం. దాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. సిన‌ర్జీని న‌మ్మాలి.

ఒక‌రినొక‌రు స‌పోర్ట్ చేసుకోవాలి`` అని అన్నారు ర‌కుల్. రీసెంట్‌గా త‌న ప్రియుడితో క‌లిసి హైద‌రాబాద్‌కి వ‌చ్చారు ర‌కుల్‌. ల‌క్ష్మీ మంచు కోసం ఓ చారిటీ షోలో వాక్ చేశారు. ప్ర‌స్తుతం ఇండియ‌న్‌2లో క‌మ‌ల్‌హాస‌న్‌తో నటిస్తున్నారు. అయిల‌న్ అనే మ‌రో సినిమాలోనూ చేస్తున్నారు. నార్త్ లోనూ చేతినిండా సినిమాలున్నాయి ర‌కుల్ ప్రీత్‌సింగ్‌కి. అక్క‌డ గ్లామ‌ర్‌కి అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌ను, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల‌నూ క‌లిపి చేస్తున్నారు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.