English | Telugu

సాయంత్రం 5 :30 కి రజనీ,కమల్ ల సంచలనం

తమినాడు చిత్ర పరిశ్రమలో ఇప్పుడొక కొత్త సంచలనం నమోదు కాబోతుంది. ఒక్క తమిళనాడే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఆ సంచలనం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆ సంచలనానికి కారణం అవుతున్న హీరోలు మాములు హీరో లు కాదు. తమిళనాడు చిత్ర పరిశ్రమాన్ని గత 30 ఏళ్ళుగా ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న రజనీ కాంత్ అండ్ కమల్ హాసన్.

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ఇండియన్ 2 .ఈ సినిమా ఇంట్రో టీజర్ ని సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నాడు. దీంతో తమిళనాడు వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొని ఉంది. రజని అండ్ కమల్ ఫ్యాన్ మధ్య ఆ ఇరువురి హీరో ల సినిమా విషయం లో గొడవలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు కమల్ ఇండియన్ 2 సినిమా ఇంట్రో టీజర్ ని రజనీ రిలీజ్ చెయ్యడం తో మేమిద్దరం ఒకటే అని ఇద్దరు ఇరువురి ప్యాన్స్ కి చెప్పినట్టు అయ్యింది.

తమిళనాడు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ వైడ్ గా భారీ సంఖ్యలో అభిమానులని కలిగి ఉన్న నటులు కమల్ అండ్ రజనీ. తమిళనాడు ప్రజానీకం మొత్తం కమల్ ,రజనీని విపరీతంగా ఆరాధిస్తుంది. లేటెస్ట్ గా జైలర్ సినిమాతో రజనీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసాడు. కమల్ కూడా తన ఇండియన్ 2 సినిమాతో సరికొత్త రికార్డులుక్రియేట్ చెయ్యాలనిఅందరు కోరుకుంటున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.