English | Telugu

17 ఏళ్ళు తన చుట్టూ తిప్పుకున్నారు.. నాగార్జునపై కాదంబరి సంచలన వ్యాఖ్యలు

కాదంబరి కిరణ్‌ కుమార్‌ గురించి అందరికీ తెలుసు. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. దాదాపు 250 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. కెరీర్‌ ప్రారంభంలో టీవీ సీరియల్స్‌లో ఎక్కువ కనిపించిన కాదంబరి స్వయంగా టీవీ సీరియల్స్‌ను కూడా నిర్మించారు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన ‘మనం సైతం’ అనే స్వచ్ఛంధ సంస్థను ప్రారంభించి దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేద కళాకారులకు ఆదుకుంటున్నారు. అంతేకాదు, లాక్‌డౌన్‌ సమయంలో కాదంబరి చేసిన సేవా కార్యక్రమాలను అందరూ ప్రశంసించారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి చెబుతూ మధ్యలో అక్కినేని నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నాగార్జునపై కాదంబరి చేసిన వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి కాదంబరి కిరణ్‌కుమార్‌ ఏం మాట్లాడారో చూద్దాం... ‘నేను చాలా సీరియల్స్‌ నిర్మించాను. ఏదైనా కొత్త ఛానల్‌ వస్తే అందులో నా సీరియల్‌ తప్పనిసరిగా ఉండేది. ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ 250 సినిమాల్లో నటించినా నాకు ఆశించినంత పేరు రాకపోవడానికి కారణం అది నా ఫేట్‌. ఒకప్పుడు నాగార్జున ఇంటికి వెళ్లి రెండున్నర గంటలు కథ చెప్పాను. అది ఒక మిరాకిల్‌ అనే చెప్పాలి. ఎందుకంటే అయన ఇంటికి వెళ్లి రెండున్నర గంటలు కూర్చోపెట్టి కథ చెప్పడం మామూలు విషయం కాదు. నాగార్జున కథ విని రెండు సన్నివేశాల్లో కరెక్షన్స్‌ చెప్పారు, ఆ రెండు కరెక్షన్స్‌ చేసుకొని మళ్ళీ కథ చెప్పడానికి 17 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాను. కానీ, ఇప్పటివరకు నా కథ మళ్ళీ వినలేదు. ఆ తర్వాత నాగార్జునతో ‘బావ’ సినిమా చెయ్యాల్సింది. కానీ, మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే అది కూడా నా ఫేటే. కొంతమందికి కొన్ని వర్కవుట్‌ అవుతాయి, కొంతమందికి అవ్వవు. అంతే. నాగార్జున నాకు ఛాన్స్‌ ఇవ్వనంత మాత్రాన నాకు పోయేది ఏమీ లేదు. నేను కాదంబరి కిరణ్‌గా వున్నాను. తర్వాత రమ్యకృష్ణతో ‘గజ్జెల గుర్రం’ చెయ్యాల్సింది అది కూడా అవ్వలేదు. సిమ్రాన్‌తో కూడా ఒక సినిమా అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఉషా కిరణ్‌ మూవీస్‌ బేనర్‌లో బాబుమోహన్‌ కొడుకుతో, బ్రహ్మానందంతో ఒక సినిమా అనుకున్నాను. అది కూడా సెట్స్‌పైకి రాలేదు. అదంతా నా తలరాత తప్ప మరేమీ కాదు.

టీవీలో సీరియల్స్‌ చేస్తున్న సమయంలో నాగేశ్వరరావుగారితో పరిచయమైంది. ఆయనతో సాన్నిహిత్యం బాగా పెరిగింది. అసలు ఒక సమయంలో నాగార్జునగారు కూడా నన్ను పిలిచి నాన్నతో టీవిలో ఒక ప్రోగ్రాంకి యాంకరింగ్‌ చేయిస్తే బాగుంటుంది అన్నారు. యాంకరింగ్‌ అంటే నాగేశ్వరరావుగారు పళ్ళు రాలగొడతారు అని చెప్పాను. అయితే ఆ తర్వాత నాగేశ్వరరావుగారితో మాట్లాడుతూ ఒక సందర్భంలో మీ అనుభవాలు చలన చిత్ర పరిశ్రమలో ఒక ‘లైబ్రరీ ఫిలిం’ అవుతుంది అని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. నాగేశ్వరరావుగారే దానికి ‘గుర్తుకొస్తున్నాయి’ అనే టైటిల్‌ పెట్టి చేద్దాం అని చెప్పారు. అప్పుడు నాగార్జున వేరే యాంకర్‌ని పెట్టి నన్ను కట్‌ చేసేసారు. నాగార్జున వ్యాపారాత్మకంగా చూసారు, నన్ను కట్‌ చేశారు. అలాగే నాగార్జునకి నేను ఇంట్లో కథ చెప్పడంతో నాకు టాలెంట్‌ వుంది అని నాగార్జున సన్నిహితుడు అన్నారు. నన్ను పొగుడుతున్నాడేమో అనుకున్నాను, కానీ, తర్వాత తెలిసింది అక్కడ కూడా నన్ను కట్‌ చేశారని. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏదో ఒక కారణం వల్ల నేను ఫెయిల్‌ అయ్యానంటే అది నా ఫేట్‌ అనే అనుకుంటున్నాను’ అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.