English | Telugu

రజనీతో పూరీ బుడ్డా రీమేక్

రజనీతో పూరీ బుడ్డా రీమేక్ చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ యాంగ్రీ మేన్ గా నటించగా, హేమమాలిని, సోనాలీ చౌహాన్, ఛార్మి, రవీనా టాండన్, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మించబడిన బాలీవుడ్ చిత్రం "బుడ్డా" క్యాప్షన్ "హోగా తేరా బాప్". ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఈ "బుడ్డా" చిత్రాన్ని సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. అయితే దీనికి రజనీ కాంత్ ఎంతవరకూ అంగీకరిస్తారన్నది ఇంకా తెలియదు. ఒకవేళ రజనీ కాంత్ ఈ "బుడ్డా" చిత్రంలో నటించాలన్నా ముందు "రాణా" చిత్రం పుర్తి కావాలి. అది 2012 లో పూర్తవుతుంది. కనుక రజనీతో పూరీ బుడ్డా రీమేక్ ఒకవేళ మొదలైతే 2012 లో ప్రారంభమవుతుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.