English | Telugu

బన్నీ గుర్రం పాటల తేది ఖరారు

అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్ర ఆడియోను మార్చి14న విడుదల చేయనున్నారు. అయితే వేదిక వివరాలు ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు.

ఈ సినిమా దాదాపు అందరికి తొలి కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. సురేందర్ రెడ్డితో బన్నీకి ఇదే తొలి చిత్రం. అలాగే బన్నీ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. తొలిసారిగా బన్నీతో కలిసి శృతిహాసన్, సలోనిలు జతకడుతున్నారు. ఇలా అన్ని తొలి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అదిరిపోయే రేంజులో ఉండబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

బన్నీ ఇప్పటి వరకు చేసిన అన్ని చిత్రాలు కూడా సంగీత పరంగా బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. అందుకే ఎలాగైనా ఈ చిత్ర ఆడియోను బ్లాక్ బస్టర్ హిట్ చేయించాలని తమన్ చాలా కష్టపడి, అదిరిపోయే పాటలను అందించాడని తెలిసింది. ఈ చిత్ర ఆడియో హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ దాదాపు 54 లక్షలకు సొంతం చేసుకున్నట్లు తెలిసింది.

శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.