English | Telugu

రభస మొదటి పాట ''మార్ సలాం'' రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రభస ఆడియోలోని మొదటి ''మార్ సలాం'' అనే పాటను బెల్లంకొండ పద్మావతి గారు విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్యశాస్త్రి గారు రాశారు. ఈ సందర్బంగా రామజోగయ్యశాస్త్రి గారు మాట్లాడుతూ.. ఈ పాటను ఎన్టీఆర్ గారికి రాసినందుకు చాలా సంతోషంగా వుంది. ఓక కమర్షియల్ సినిమాలో దేశభక్తి ప్రధానమైన పాటను రాసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్టీఆర్ గారికి, బెల్లంకొండగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆడియోలోని ఐదు పాటలు ఒకదానికి ఒకటి పోటీ పడుతాయని చెప్పారు.

More NTR Rabhasa Audio Release Photos

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.