English | Telugu

'బలగం' సినిమా గురించి గ్రూప్-4 పరీక్షలో వచ్చిన ప్రశ్న!

'బలగం' ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాని తెలంగాణలోని ప్రతీ జిల్లాలో,‌ప్రతీ మండలంలో‌ ప్రత్యేక స్క్రీన్ లు ఏర్పాటు చేసుకొని మరీ చూసారు. ఈ సినిమా చూసి ఎంతో మంది విడిపోయిన వారు మళ్ళీ కలిసారు. ఎన్నో సంవత్సరాల నుండి మాట్లాడుకోని వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. అంతటి ఇంపాక్ట్ ఇచ్చిన ఈ 'బలగం', ఇప్పుడు మరో ఘనతని సాధించింది.

వేణు ఉడుగుల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ సినిమా వెండితెరపై బ్లాక్ బస్టర్‌ అయింది. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ సినిమాకు వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 మార్చి 3న థియేటర్లలో విడుదలై, మార్చి 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఆ తర్వాత స్కూల్స్ లో పంచాయతీలలో ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసి ఈ సినిమాని ప్రదర్శించడంతో అంతటా అభినందనలు లభించాయి. కొమురయ్య పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ.. ప్రతీ ఇంటి కథలాగా తీర్చిదిద్దాడు వేణు ఎల్దండి.

అయితే తాజాగాతెలంగాణలో జరిగిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమా గురించి ఒక ప్రశ్న వచ్చింది. దానికి సంబంధించిన ప్రశ్నని డైరెక్టర్ వేణు ఎల్దండి తన సోషల్ మీడియాలో పోస్డ్ చేసాడు. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, కొమురయ్య పాత్రధారి వివరాలు ఇచ్చి సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి పలు అవార్డులు వచ్చాయి. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రతీ ఒక్కరిని కదిలించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా మరో మైలురాయిని చేరుకుంది. ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ పరీక్షల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రశ్న అడగడం చాల గర్వంగా ఉందని వేణు ఎల్దండి షేర్ చేసుకున్నాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.