English | Telugu

ఆర్య, అనుష్క జంటగా పి వి పి చిత్రం

పి వి పి సినిమా పతాకంపై, తమిళ హీరో ఆర్య, అందాల యోగా టీచర్ అనుష్క జంటగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో పొట్లూరి.వి.ప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం డిసెంబర్ 24 వ తేదీన హైదరాబాద్ శివార్లలో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో నిరాడంబరంగా ప్రారంభమైంది. "నేను దేవుణ్ణి" "నేనే అంబానీ" చిత్రాల్లో ఆర్య హీరోగా నటించి తేలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యాడు.

ఈ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ "7/జి బృందావన్ కాలనీ", "ఆడవారిమాటలకు అర్థాలు వేరులే", "యుగానికొక్కడు" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నపొట్లూరి.వి.ప్రసాద్ తన పి వి పి సంస్థ ద్వారా విక్రమ్ హీరోగా, దీక్షాసేథ్ హీరోయిన్ గా తెలుగు తమిళ భాషల్లో "వీడింతే" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.