English | Telugu

పూరి - నితిన్‌... డిష్యూం డిష్యూం?

నితిన్ సినిమా ఆగిపోయిన త‌ర‌వాత‌ పూరి జ‌గ‌న్నాథ్‌కి కంటిమీద కునుకు ఉంటుందో, లేదో..? ఎందుకంటే.. వ‌రుస‌గా ఆయ‌న‌కు అన్నీ త‌ల‌నొప్పులే ఎదుర‌వుతున్నాయి. ఓ వైపు.. చిరు 150వ సినిమా ఉంటుందా, ఊడుతుందా అనే టెన్ష‌న్ ప‌ట్టుకొంది. త‌న సినిమాల విష‌యంలో ఛార్మి విప‌రీతంగా జోక్యం చేసుకొంటోంద‌న్న టాక్‌బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు నితిన్ వైపు నుంచి కూడా పూరి ఒత్తిడికి గుర‌వుతున్నాడు.

నితిన్ సినిమా విష‌యంలో సుధాక‌ర్ రెడ్డి నుంచి పూరి అడ్వాన్సుగా రెండో కోట్ల రూపాయ‌లు తీసుకొన్న‌ట్టు వినికిడి. ఇప్పుడా రెండు కోట్లు వెన‌క్కి ఇవ్వ‌మ‌ని నితిన్ ఒత్తిడి తీసుకొస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు పూరి 'చూద్దాం, చేద్దాం' అని కాల‌యాప‌న చేస్తున్న‌ట్టు, ఈ విష‌యంలో నితిన్ ద‌ర్శ‌కుల సంఘానికి ఫిర్యాదు చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు ఛార్మిపై సుధాక‌ర్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.

'డ‌బ్బులు లేక‌పోవ‌డం వ‌ల్లే నితిన్ సినిమా ఆడిపోయింద‌'న్న త‌ప్పుడు స్టేట్ మెంట్స్ ఇవ్వ‌డం వల్ల త‌న ప‌రువు పోయింద‌ని, ఈ వ్య‌వ‌హారంపై నిర్మాత‌ల మండ‌లి ఛార్మిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తోంది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ హ‌గ్గులిచ్చుకొని ఫొటోల‌కు పోజులిచ్చిన పూరి - నితిన్‌ల మ‌ధ్య ఇప్పుడు గంభీర‌మైన వాతావ‌ర‌ణం న‌డుస్తోంది. మ‌రి చివ‌రికి ఈ క‌థ ఎలా ముగుస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.