English | Telugu

పూరీ తిట్టాడా....అయితే ఓకే!

పూరీజగన్నాథ్ తిట్టాడా అయితే హిట్టుకొట్టినట్టే అని ఫిల్మ్ నగర్ టాక్. ఎందుకంటే బయట తిడితే కోప్పడే జనాలు సినిమాల్లో తిడితే మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా పూరీ సినిమా టైటిల్ లో తిట్టు ఉందంటే అది బ్లాక్ బస్టరే అని టాక్. గతంలో ఇడియట్, దేశముదురు, పోకిరి, టెంపర్ ఇవన్నీ విజయం సాధించినవే.

లేటెస్ట్ గా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో తెరకెక్కించనున్న మూవీకి లోఫర్ అని టైటిల్ ఫిక్స్ చేశాడు. దీంతో ఇది కూడా తిట్టేగా....అయితే హిట్టే అని జనాలు ఫిక్సయ్యారు. మరోవైపు పూరీ సినిమాలో హీరో అంటే చెలరేగిపోతుంటాడు.

అసే ఒసే రాయె పోయె అని రెచ్చిపోతుంటాడు. అలాంటింది ముకుంద సినిమాలో సైలెంట్ గా కనిపించి.... మాటల కన్నా నటనపై ఎక్కువ దృష్టి పెట్టిన వరుణ్.... లోఫర్ గా సెట్టవుతాడా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. మొత్తానికి ఆరంభంలో క్లాస్ గా కూల్ అనిపించుకున్న కుర్రాడు...మాస్ గా మెప్పిస్తాడేమో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.