English | Telugu

పూరివి కోటి రూపాయ‌లు పోయాయ్‌!

టెంప‌ర్ విజ‌యంతో సంబ‌రాలు చేసుకొంటోంది టీమ్‌. ఎన్టీఆర్ భ‌లే చేశాడు, పూరి అద్భుతంగా తీశాడు... అంటూ మెచ్చుకోళ్లు వినిపిస్తున్నాయ్‌. అయితే వ‌సూళ్లు మాత్రం నాలుగో రోజు నుంచే డ‌ల్ అయిపోయాయ‌ని టాక్‌. ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కూ రూ.30 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. సినిమాకి అయ్యింది రూ.40 కోట్లు.. ఇంకో ప‌ది కోట్లు రావ‌డం గ‌గ‌న‌మే అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. స్వ‌యంగా పూరిజ‌గ‌న్నాథ్‌కి రూ.కోటి పోయాయ‌ని టాక్‌. ఈ సినిమా వెస్ట్ గోదావ‌రి రైట్స్ పూరి త‌న వ‌ద్దే ఉంచుకొన్నాడు. దాని నిమిత్తం రూ.2.5 కోట్లు బండ్ల‌కు తిరిగి ఇచ్చేశాడు. అయితే ఇప్ప‌టికి రూ.1.5 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ట‌. అంటే మ‌రో కోటి రూపాయ‌లు రావాలి. ఇక వెస్ట్ గోదావ‌రి నుంచి పైసా కూడా రాదు. ఎందుకంటే అక్క‌డ టెంప‌ర్‌థియేట‌ర్లు డెఫ్‌షీట్ల‌లో న‌డుస్తోంది. అంటే సినిమా న‌డిపించుకోవాలంటే డ‌బ్బులు తిగిరి చెల్లించాల‌న్న‌మాట‌. అంటే వ‌చ్చిన కోటిన్న‌ర కూడా మెల్ల‌గా క‌ర‌గ‌డం ఖాయం. టెంప‌ర్ వ‌ల్ల ద‌ర్శ‌కుడిగా పూరికి పేరొచ్చిందేమోగానీ, పంపిణీదారుడిగా కోటి రూపాయ‌లు పోగొట్టుకొన్నాడ‌న్న‌మాట‌.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.