English | Telugu

కాంతార ఆఫ‌ర్‌ని రిజ‌క్ట్ చేసిన ప‌వ‌ర్‌స్టార్‌!

కాంతార మూవీలో హీరోగా న‌టించ‌మ‌ని ముందు ప‌వ‌ర్‌స్టార్‌నే అప్రోచ్ అయ్యార‌ట రిష‌బ్ శెట్టి. కానీ, నేను చేయ‌న‌ని రిజ‌క్ట్ చేశార‌ట ప‌వ‌ర్‌స్టార్‌. ఇంత‌కీ ఏమైంది? ఎందుకు రిజ‌క్ట్ చేశార‌ని ఆరా తీస్తే, ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు చెప్పుకొచ్చారు రిష‌బ్ శెట్టి. ``2022లో బిగ్గెస్ట్ హిట్‌గా పేరు తెచ్చుకున్న సినిమా కాంతార‌. రిష‌బ్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాదు, ఈ సినిమాలో న‌టించారు. ఈ ఒక్క సినిమాతో నేష‌న‌ల్ సినీ మ్యాప్‌లో రిష‌బ్‌కి స్పెష‌ల్ ప్లేస్ ద‌క్కింది. అయితే, ఈ సినిమాలో న‌టించ‌మ‌ని క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్‌నే ఫ‌స్ట్ అప్రోచ్ అయ్యార‌ట రిష‌బ్ శెట్టి. ``అప్పుకైతే శివ కేర‌క్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ గా ఉంటుంద‌నిపించింది. అందుకే అప్రోచ్ అయ్యాను.

కానీ అప్ప‌టికే ఆయ‌న హెక్టిక్ షెడ్యూల్స్‌తో ఉన్నారు. పైగా ఈ కేర‌క్ట‌ర్ కోసం కోస్ట‌ల్ క‌ర్ణాటిక్ డైల‌క్ట్ లో మాస్ట‌ర్ కావాల‌ని చెప్పాను. ఆయ‌న చేస్తే ప్రాజెక్ట్ ఇంకో రేంజ్‌లో ఉంటుంద‌ని అనుకున్నాను. ముఖ్యంగా బ‌ఫెలో సీన్స్ లో ఆయ‌న్ని ఊహించుకున్న‌ప్పుడు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. పునీత్ కూడా క‌థ విని ఎగ్జ‌యిట్ అయ్యారు. కానీ, ఆయ‌న‌కున్న అద‌ర్ క‌మిట్ మెంట్స్ వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ప్రిప‌రేష‌న్‌కి టైమ్ కేటాయించ‌లేక‌పోయారు. ఓ రోజు ఫోన్ చేసి, ఈ సినిమాలో తనే కావాల‌నుకుంటే ఇంకో ఏడాది పాటు ఆగాల్సి ఉంటుంద‌ని, త‌ను లేకుండా ప్రొసీడ్ అవ్వ‌మ‌ని చెప్పారు. అప్పుడు డిసైడ్ అయి నేనే చేశాను`` అని అన్నారు రిష‌బ్‌.

ఈ సినిమాను పునీత్ సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడ‌నే లేదు. గుండెపోటుతో 2021లో క‌న్నుమూశారు పునీత్‌. కాంతార క‌న్న‌డ‌లో తొలుత విడుద‌లైన‌ప్ప‌టికీ, తెలుగు, హిందీతో పాటు మిగిలిన భాష‌ల్లోనూ రెండు వారాల త‌ర్వాత విడుద‌లైంది. 400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కాంతార 2 సినిమాను ఈ మార్చిలో మొద‌లుపెట్టారు. కాంతార‌కి ఇప్పుడు వ‌స్తున్న‌ది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్‌. ప్ర‌స్తుతం రీసెర్చి ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్రీక్వెల్‌లో హిస్ట‌రీని డీప్‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు హోంబ‌లే ఫిల్మ్స్.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.