English | Telugu

జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ 'పులిమేద' ట్రైలర్ విడుదల

ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై ఏ.కె. సజన్ దర్శకత్వంలో జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా 'పులిమేద'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. విభిన్నంగా సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఇటీవల 'ఇరట్ట' సినిమాతో మంచి విజయం సాధించిన జోజు జార్జ్ 'పులిమేద' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మరో మంచి రోల్ ప్లే చేస్తోంది.

ఐన్ స్టీన్ మీడియా గతంలో జోజు జార్జ్ తో డైరెక్టర్ జోషి దర్శకత్వంలో అంథోని సినిమా చేశారు. పులిమేద వారి కాంబినేషన్ లో రెండో సినిమా. ఈ సినిమాకు ఇషాన్ దేవ్ సంగీతం అందించారు. బాలచందర్ మీనన్, క్రీమ్బెన్ వినోద్, జానీ అంథోని, జాఫర్ ఇడుక్కి, జియో బేబీ, అబు సలీమ్, సోనా నాయర్, కృష్ణ ప్రభ, పూలే విల్సన్, శిబిల తదితరులు ఈ సినిమాలో నటించారు. అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.