English | Telugu

ఓపెన్ బుక్ మనం.. ఎవడికీ భయపడే పనేలేదు

నటసింహం నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం. మనసులో ఏదీ దాచుకోరు. మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేస్తారు. తన వ్యక్తిగత విషయాలపై స్పందించడానికి కూడా ఆయన మొహమాట పడరు. తాజాగా తన విగ్గు గురించి మాట్లాడిన బాలకృష్ణ.. తాను తెరిచిన పుస్తకం లాంటి వాడిని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

"అప్పట్లో ఇప్పటిలాగా క్యారవాన్ లు ఉండేవి కాదు కదా. విగ్గు తీసి హ్యాపీగా చెట్టు కింద చాప, దిండు వేసుకొని విశ్రాంతి తీసుకునేవాడిని. మొన్న ఎవడో అన్నాడు.. ఈయన విగ్గు పెట్టుకుంటాడా అని. నీకేంటి? నువ్వేం పీక్కొని గడ్డం పెట్టుకుంటావు అన్నాను. ఓపెన్ బుక్ మనం అంతా. ఎవడికీ భయపడే పనేలేదు." అని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం బాలయ్య మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.