English | Telugu

అత‌నికి అంత సీన్ లేదు.. వేణుస్వామి జ్యోతిషంపై కౌంట‌ర్ ఇచ్చిన ప్ర‌గ‌తి!

- ప్ర‌గ‌తిని టార్గెట్ చేసిన వేణుస్వామి
- వేణుస్వామితో పూజ‌లు
- ఏషియ‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో ప్ర‌గ‌తికి నాలుగు మెడ‌ల్స్‌

టాలీవుడ్‌లోని ప్ర‌ముఖుల విష‌యంలో అనేక సార్లు వివాదాల్లో చిక్క‌కున్న వేణుస్వామి మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఒక బంగారు, మూడు రజత పతకాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఈ విజయం వెనుక తన పూజల ప్రభావం ఉందని జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఈ విషయంపై స్పందించిన ప్రగతి, పూజలు చేయించుకున్న విషయం నిజమేనని, తన మెడల్స్ వెనుక అసలైన కారణం కష్టపడి చేసిన సాధన మాత్రమేనని స్పష్టం చేశారు. అప్పటి పూజల ఫోటోలు ఇప్పుడు వైరల్ చేయ‌డం స‌రికాద‌ని ఆమె అంటున్నారు.


కెరీర్ ఆరంభం నుంచే విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్ర‌గ‌తి. నటనతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ విజ‌యాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ పోటీల్లో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించారు. మొత్తంగా నాలుగు మెడల్స్ గెలుచుకోవడం ద్వారా, ఒకప్పుడు తన వయస్సు గురించి, ఫిట్‌నెస్ గురించి విమర్శలు చేసిన వారికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు.


ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. ప్రగతి తన కెరీర్ బాగుండాలని, రెజ్లింగ్‌లో ఎదగాలని తన వద్ద పూజలు చేయించుకుందని, ఆ పూజల ఫలితంగానే ఆమెకు ఈ నాలుగు మెడల్స్ వచ్చాయని వేణుస్వామి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు ప్ర‌గ‌తి. వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న విషయం నిజమేనని, అయితే అది సుమారు రెండున్నరేళ్ల క్రితం తాను మానసికంగా చాలా కష్టమైన దశలో ఉన్నప్పుడు జరిగిందని వివరించారు. ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, క్రీడల్లో గానీ ఎలాంటి ప్రత్యక్ష ఫలితం కనిపించలేదని స్పష్టంగా చెప్పారు.


ఆ పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇప్పుడు బయటపెట్టి, తన విజయం మొత్తానికి తానే కారణమన్నట్లు వేణుస్వామి చెప్పుకోవడాన్ని ప్రగతి తప్పుబట్టారు. తన విజయాన్ని వేణుస్వామి ఖాతాలో వేసుకోవడాన్ని ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని అన్నారు ప్ర‌గ‌తి. జిమ్‌లో చెమట చిందించి, శారీరకంగా, మానసికంగా పోరాడి సాధించిన విజ‌యానికి జ్యోతిష్యాన్ని జోడించ‌డం సరికాదని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.