English | Telugu

జేమ్స్ బాండ్ మూవీ లొకేష‌న్‌లో ప్ర‌భాస్‌!

క‌లిసొచ్చే కాలం వ‌స్తే న‌డిచొచ్చే కొడుకు పుడ‌తాడ‌న్న‌ది పాత కాలం మాట‌. ఇప్ప‌టి మాటేంటో తెలుసా? క‌లిసొచ్చే కాలం వ‌స్తే, నిన్న‌మొన్న‌టిదాకా హాలీవుడ్ హీరోల సినిమాల్లో చూసిన లొకేష‌న్ల‌లో మ‌న‌వాళ్లు తిర‌గ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఈ మాటను ముమ్మాటికీ నిజం చేస్తున్నారు ప్యాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ ప్ర‌భాస్‌. ఆయ‌న ప్ర‌స్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న లొకేష‌న్ గురించి ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు జ‌నాలు. అందుకు రీజ‌న్‌, ఆ లొకేష‌న్‌లో ఇంత‌కు ముందు జేమ్స్ బాండ్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డ‌మే.

ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న సినిమా స‌లార్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఇట‌లీలో తెర‌కెక్కిస్తున్నారు. స‌లార్‌లో ప్ర‌భాస్ డ‌బుల్ యాక్ష‌న్ చేస్తున్నారు. హోంబ‌లే ఫిల్మ్ కంపెనీ ప‌తాకంపై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్న సినిమా ఇది. 2021 జేమ్స్ బాండ్ సినిమాలో చూసిన సౌత్ ఇట‌లీలోని ఫేమ‌స్ ప్రీ హిస్టారిక్ వైట్ వాష్డ్ కేవ్స్ మ‌టేరాలో స‌లార్ షూటింగ్ జ‌రుగుతోంది. జేమ్స్ బాండ్ సినిమా నో టైమ్ టు డైలో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని తెర‌కెక్కించారు ఈ ప్ర‌దేశంలో. దీంతో పాటు ప‌లు ఇంట‌ర్నేష‌నల్ వెంచ‌ర్స్ కూడా ఇక్క‌డ షూట్ చేశారు. ఇప్పుడు స‌లార్ సినిమాను కూడా తెర‌కెక్కిస్తున్నారు. అక్క‌డి లోక‌ల్ పోలీసులు స‌లార్ టీమ్‌కి స‌హ‌క‌రిస్తున్నారు.

డ్రోన్స్, నైట్ షూటింగులు వేగంగా జ‌రుగుతున్నాయి. రోమ్‌లోనూ, బుడాపెస్ట్ లోనూ స‌లార్ షూటింగ్ ఆల్రెడీ జ‌రిగింది. త‌మ సంస్కృతుల‌ను, దూరాల‌ను మ‌ర్చిపోయి ప్రేమ‌లో ప‌డ్డ ఇద్ద‌రు వ్య‌క్తులు, వారి దేశాలు, స‌రిహ‌ద్దులు వారి ప్రేమ‌కు ఎలాంటి అవాంత‌రాలు తెచ్చిపెట్టాయ‌నే క‌థ‌తో స‌లార్ ఉంటుంద‌నే వార్త‌లూ వైర‌ల్ అవుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 23న విడుద‌ల కానుంది. క‌న్న‌డ‌, త‌మిళ్‌, మ‌ల‌యాళం, హిందీ, ఇంగ్లిష్‌లో తెర‌కెక్కుతోంది స‌లార్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.