English | Telugu

మరోసారి వివాదంలో చిక్కుకున్న 'ఆదిపురుష్‌'.. కొత్త కేసు!

ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా ఇప్పుడు మ‌ళ్లీ స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంది. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ప్ర‌తీక్ సంఘ‌ర్ అనే వ్య‌క్తి తాజాగా ఆదిపురుష్ టీమ్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. మేథో చౌర్యం జ‌రిగింద‌ని అన్నారు. ప్ర‌భాస్ హీరోగా, కృతిస‌న‌న్ నాయిక‌గా న‌టిస్తున్న సినిమా ఆదిపురుష్‌. జూన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఓం ర‌వుత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ ఆ మ‌ధ్య అయోధ్య‌లో జ‌రిగింది. టీజ‌ర్‌లో యానిమేష‌న్ క్వాలిటీగా లేదంటూ విమ‌ర్శ‌లొచ్చాయి. దాంతో ముందు అనుకున్న తేదీకి సినిమాను విడుద‌ల చేయ‌కుండా వాయిదా వేశారు మేక‌ర్స్. ఆ త‌ర్వాత ఈ సినిమాలో రామ‌ల‌క్ష్మ‌ణుల‌కు జంధ్యం లేదంటూ నార్త్ లో పోలీస్ కంప్లయింట్లు చేసిన వారు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో లేటెస్ట్ గా కాన్సెప్ట్ ఆర్టిస్ట్ చేస్తున్న ఆరోప‌ణ‌లు అంద‌రి దృష్టినీ ఆక‌ట్టుకుంటున్నాయి. తాను గ‌తంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ప్యాట‌ర్న్స్ తీసుకుని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇలా వాడుకున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆర‌రోప‌ణ‌.

ప్ర‌తీక్ మాట్లాడుతూ ``ఇలాంటివారికి నిబ‌ద్ధ‌త ఉండ‌దు. చేస్తున్న ప‌నిని ప్రాణం పెట్టి చేయాల‌న్న ఆలోచ‌న ఉండ‌దు. అందుకే ఇలాంటి మేథో చౌర్యానికి పాల్ప‌డుతుంటారు. ఆదిపురుష్ విజువ‌ల్ డిజైన‌ర్ టి.పి.విజ‌య‌న్ చేసిన ప‌నిని జీర్ణించుకోలేక‌పోతున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు స్క్రీన్ మీద ఫెయిల్ కావ‌డానికి కూడా ఈ త‌ర‌హా టెక్నీషియ‌న్లే కార‌ణం. చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. నా ఒరిజిన‌ల్ వ‌ర్క్ కి సంబంధించిన లింకు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను`` అని అన్నారు. మ‌ర్యాద‌పురుషోత్త‌ముడి క‌థ‌తో ఓం ర‌వుత్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఆదిపురుష్‌. ఇటీవ‌ల హ‌నుమంతుడి పోస్ట‌ర్‌ని కూడా విడుద‌ల చేశారు మేక‌ర్స్. త్రీడీలో తెర‌కెక్కుతోంది. మ‌న పురాణాల గురించి యువ‌కులు, పిల్ల‌లు తెలుసుకోవ‌డానికి ఇది చ‌క్క‌టి మాధ్య‌మం అని అన్నారు ఓం ర‌వుత్‌. హైద‌రాబాద్‌లోనూ ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించారు ద‌ర్శ‌కుడు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.